ఎవడి పనిలో వాడు ఉంటే మన తెలుగువాళ్ళలో కొంతమందికి పనీపాటా లేక తెలంగాణా బ్లాగులు రాశేస్తున్నారు. వీళ్ళకి ఇదేం ఆనందమో నాకైతే అర్ధం కావట్లేదు. వీళ్ళలో కొంతమంది రాజకీయ స్వలాభం కోసం రాస్తుంటే, కొంతమంది ధనాన్ని ఆశించి రాస్తున్నారు. ఐతే ఎక్కువమంది ఏదో స్వాతంత్ర పోరాతం చేస్తున్నట్టు ఫీలైపోతున్నారు. నిజానికి వీళ్ళకి కాదు తిక్క, ఆ విషయం గురించి వీళ్ళ పోస్టులు చదివుతున్న మనకి.
“తెలంగాణా ప్రజలు 1969 లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు”, “Six Point Formula”, “371-D సవరణ”, ” గాడిద గుడ్డు” అంటూ జనాలకి సంబధం లేని చెత్త అంతా చెప్పి కంఫ్యూస్ చేస్తూ మన బుర్రల్లో గుజ్జుని జుర్రుకోవడంలో వీళ్ళకి వచ్చే ఆనందం ఏమిటో అస్సలు పాలుపోవట్లేదు. మొత్తం వెబ్లో ఉన్న బ్లాగుల్లో ఓ ముప్పైశాతం ఈ సోదిగాళ్ళ బ్లాగులే ఉంటాయి చెండాలంగా.
మీరు గమనించారో లేదో, మన ఊళ్ళలో అక్కడక్కడా క్రిస్టియన్ చర్చిల్లో వాళ్ళు, గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చేస్తూ, పేజీలకొద్దీ వ్యాసాలు రాసేస్తూ, వందల కొద్దీ క్రీస్తు పాటలు రాసేస్తూ ఉంటారు; అది చూస్తేనే ఒకోసారి తిక్క దె**ది. వాళ్ళని చూసి అనుకునే వాడిని, ఏది ఏమైనా వీళ్ళు “సాహిత్యం”లో చాల గొప్పవాళ్ళు అనుకునేవాన్ని. ఇప్పుదు ఈ తెలంగాణా పోరాటయోధుల్ని చూశాక కూడ అదే ఫీలింగ్.
ఏం చేస్తంలే, తోటి తెలుగువాళ్ళే కదా అని ఇణ్ణళ్ళూ నోరుమూసుకుని ఊరుకున్నా. మొన్న మా ఫ్రెండుని, నువ్వు కూడా తెలుగు బ్లాగు రాయచ్చు కదరా అంటే, “నాకేమన్నా మెంటల్ అనుకున్నావా, మనం ఎంత ఇదిగా రాశినా ఆ తెలంగాణా బ్లాగుల మధ్యలో మనది కనపడను కూడా కనపడదు” అన్నాడు. అది విన్నాక ఈ ఎదురుదాడి నాకు తప్పలేదు.
తెలంగాణా కనక వేర్పడితే, వేర్పడిన రాష్ట్రంలో నేటివ్ తెలంగాణా వారు మాత్రమే ఉండాలి అంటే, “అది చచ్చు ఆలోచన అని తెలుసుకుని, ఇప్పటివరకు తెలంగాణా వాగుడు వాగిన వాళ్ళందరు నాలిక్కరుచుకుంటారు. ఇది ముమ్మాటికీ నిజం.”